Chandrababu: దుర్గగుడి వ్యవహారం: సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి మాణిక్యాలరావు

  • దుర్గగుడిలో తప్పు జరిగిన మాట వాస్తవమే
  • నలభై ఎనిమిది గంటల్లోగా నివేదిక వస్తుంది
  • ఆ తర్వాత చర్యలు చేపడతాం: మీడియాతో మాణిక్యాలరావు

విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఈ విషయమై చర్చించేందుకు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అంతకుముందు, మీడియాతో మాణిక్యాల రావు మాట్లాడుతూ, దుర్గగుడిలో తప్పు జరిగిన మాట వాస్తవమేనని, ఈ ఘటనపై నలభై ఎనిమిది గంటల్లోగా తమకు నివేదిక వస్తుందని, దీని ఆధారంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఏ స్థాయి వ్యక్తి ఉన్నా వదలిపెట్టమని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.  

  • Loading...

More Telugu News