Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసి కృతజ్ఞతలు చెప్పిన పొట్టివీరయ్య

  • చిరంజీవిని నిన్న కలిసిన పొట్టి వీరయ్య
  • రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసినందుకు కృతజ్ఞతలు  
  • ఇటీవల అనారోగ్యానికి గురైన పొట్టి వీరయ్య 

ప్రముఖ సీనియర్ కమెడియన్ పొట్టి వీరయ్యకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆర్థిక సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని నిన్న కలిసిన ఆయన తనకు ఆర్థిక సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. పొట్టి వీరయ్య అనారోగ్యానికి గురవడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగుండలేదంటూ పత్రికలో వచ్చిన కథనం చదివిన చిరంజీవి సతీమణి సురేఖ, ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పడంతో ఆయన స్పందించారు. ఆర్థిక సాయం కింద పొట్టి వీరయ్యకు రూ.2 లక్షలు అందజేయడం జరిగింది.

  • Loading...

More Telugu News