charan: రేపటి నుంచి 'రంగస్థలం' తాజా షెడ్యూల్ షూటింగ్

  • తదుపరి షెడ్యూల్ రాజమండ్రిలో 
  • పాటల చిత్రీకరణకు సన్నాహాలు 
  • మార్చి 30వ తేదీన సినిమా రిలీజ్    

చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో 'రంగస్థలం' చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. క్రిస్మస్ .. న్యూ ఇయర్ సందర్భంగా బ్రేక్ తీసుకున్న ఈ సినిమా టీమ్, రేపటి నుంచి తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించనుంది. ఈ నెల 12వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.

 ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆ తరువాత షెడ్యూల్ ను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో పాటలను చిత్రీకరించనున్నారు. దాంతో దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. మార్చి 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.    

  • Loading...

More Telugu News