Rajinikanth: ప్రజలు ఏకతాటిపైకి రండి.. నా పార్టీలో చేరండి: రజనీకాంత్ వీడియో సందేశం

  • కొత్త పార్టీ స్థాపనకు అప్పుడే రజనీ ప్రణాళిక
  • తన పొలిటిక‌ల్ ఎంట్రీని స్వాగతించిన అభిమానులకు కృత‌జ్ఞ‌త‌లు
  • నా పార్టీలో వాలంటరీలుగా చేరండంటున్న రజని 

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ సినీన‌టుడు రజనీకాంత్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కొత్త‌ పార్టీని స్థాపించే దిశ‌గా ఆయ‌న అప్పుడే ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. ఈ క్రమంలో వెబ్‌ సైట్ తో పాటు యాప్‌ను విడుద‌ల చేశారు. రజనీమండ్రమ్‌.కామ్‌ వెబ్‌ సైట్‌ను ప్రారంభించి ఓ ప్ర‌సంగ వీడియోను పోస్ట్ చేశారు. తన పొలిటిక‌ల్ ఎంట్రీని స్వాగతించిన అభిమానులకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. స‌మాజంలో మార్పు కోసం అభిమానులు, తమిళనాడు ప్రజలు ఏకతాటిపైకి రావాలని కోరారు. త‌న‌ పార్టీలో వాలంటరీలుగా చేరాలని అన్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. త‌న పార్టీ పేరును మాత్రం ర‌జ‌నీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.  

  • Loading...

More Telugu News