surya: సూర్య న్యూ మూవీ మొదలైపోయింది!

  • సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య
  • సూర్యకి ఇది 36వ సినిమా  
  • కథానాయికగా సాయిపల్లవి 

సూర్య తాజా చిత్రంగా 'తానా సెరిందా కూట్టమ్' విడుదలకి సిద్ధమవుతోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఈ కాంబినేషన్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఒక వైపున ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటే, మరో వైపున ఆయన తదుపరి చిత్రాన్ని కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.

 డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించనున్నాడు. సూర్యకి ఇది 36వ సినిమా కాగా, ఆయన సరసన కథానాయికగా సాయిపల్లవి నటించనుంది. సెల్వ రాఘవన్ విభిన్నమైన కథా చిత్రాలను ఎంచుకుంటూ, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కూడా, డిఫరెంట్ కంటెంట్ తో కూడినదేనని అంటున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.  

  • Loading...

More Telugu News