Pakistan: కులభూషణ్‌ తల్లి, భార్య పట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుకి ప్రతీకారం?.. పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన భార‌త్‌!

  • వ‌చ్చే నెల 1 నుంచి ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గాలో ఉర్సు వేడుకలు
  • పాల్గొనడానికి పాక్ నుంచి 192 మంది యాత్రికుల దరఖాస్తు
  • వీసాలు ఇవ్వ‌ని భార‌త్‌
  • పాకిస్థానీయుల‌ ప్ర‌యాణం వాయిదా  

పాకిస్థాన్‌ జైలులో ఉన్న భార‌త నేవీ మాజీ అధికారిని చూడ‌డానికి వెళ్లిన ఆయ‌న తల్లి, భార్య పట్ల అక్కడి అధికారులు ప్రవర్తించిన తీరుపై స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌లు వ‌స్తోన్న‌ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని భార‌త్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుంది.

వ‌చ్చే నెల 1 నుంచి 8 వరకు ఢిల్లీలోని హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గాలో ఉర్సు వేడుకలు జరుగనున్న నేప‌థ్యంలో ఇందులో పాల్గొనడానికి పాకిస్థాన్‌ నుంచి 192 మంది యాత్రికులు దరఖాస్తు చేసుకోగా, వారికి భారత్‌ వీసాలు నిరాకరించింది. దీంతో చివరి నిమిషంలో పాకిస్థానీయుల ప‌ర్య‌ట‌న‌ వాయిదా ప‌డింది. భార‌త్ తీసుకున్న చ‌ర్య దురదృష్టకరమని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ విచారం వ్య‌క్తం చేసింది.          

  • Loading...

More Telugu News