charan: 'రంగస్థలం' పుటేజ్ మిస్ అయిందా?

  • ముగింపు దశకి చేరుకున్న 'రంగస్థలం' 
  • షూటింగ్ రషెస్ చూస్తుండగా టెక్నికల్ ప్రోబ్లమ్ 
  • రీ షూట్ అంటూ ప్రచారం  

సుకుమార్ .. చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'రంగస్థలం' .. షూటింగ్ పరంగా చివరి దశకు చేరుకుంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, సాంగ్స్ షూటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతోందట. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా పూర్తి రషెస్ ను ఇటీవల టీమ్ అంతా కలిసి చూశారట. ఆ సమయంలోనే కొన్ని టెక్నీకల్ ప్రొబ్లమ్స్ వలన హార్డ్ డిస్క్ లోని కొంత ఫుటేజ్ ఎగిరిపోయినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

 చరణ్ .. సమంతా కాంబినేషన్లో చేసిన కొన్ని సీన్స్ .. హార్డ్ డిస్క్ నుంచి ఎగిరిపోయాయని అంటున్నారు. ఆ సీన్స్ ను రీ షూట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోందనీ, మళ్లీ కాల్షీట్స్ ఇవ్వడానికి చరణ్ కూడా ఓకే చెప్పేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందే చెప్పారు. జరిగిన సంఘటన ప్రభావం విడుదల తేదీపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    

  • Loading...

More Telugu News