Chandrababu: వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచే పోటీ చేస్తా: బాలకృష్ణ

  • గొల్లపల్లి నుంచి హిందూపురానికి నిర్మించనున్న వాటర్ పైపులైన్
  • పైపులైన్ పనులకు భూమి పూజ నిర్వహించిన బాలకృష్ణ
  • ‘రైతు రథం’ ట్రాక్టర్ల పంపిణీ.. ట్రాక్టర్ నడిపిన బాలయ్య

వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచే పోటీ చేస్తానని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలోని గొల్లపల్లి నుంచి హిందూపురం పట్టణానికి నిర్మించనున్న వాటర్ పైపులైన్ పనులకు బాలకృష్ణ ఈరోజు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పైపులైన్ నిర్మాణం ద్వారా హిందూపురం పట్టణ వాసులకు మంచినీటి ఎద్దడి తొలగిపోయే అవకాశముందని అన్నారు. పేద, బడుగులు, రైతులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా 106 మంది రైతులకు ‘రైతు రథం’ ట్రాక్టర్లను, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను ఆయన పంపిణీ చేశారు. రైతులతో కలిసి బాలయ్య కూడా ట్రాక్టర్ నడిపి వారిని ఉత్సాహపరిచారు.

  • Loading...

More Telugu News