Balakrishna: బాలయ్య 102వ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు!

  • 'జై సింహా' షూటింగ్ పూర్తి
  • రామోజీ ఫిలిం సిటీలో చివరి సన్నివేశం 
  • గుమ్మడికాయ కొట్టిన యూనిట్ సభ్యులు

నందమూరి బాలకృష్ణ కెరీర్లో 102వ చిత్రంగా తెరకెక్కిన 'జై సింహా' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిట్టచివరి సన్నివేశాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టి, షూటింగ్ కు ముగింపు పలికింది చిత్ర యూనిట్.

కేఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా... బాలయ్య సరసన నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా అభిమానుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News