Ram Nath Kovind: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’

  • ‘ఎట్ హోమ్’కు హాజరైన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్
  • డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తెలంగాణ మంత్రులూ హాజరు
  • శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ లో బస చేస్తున్న కోవింద్

హైదరాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. కాగా, శీతాకాల విడిదిలో భాగంగా కోవింద్ నాలుగు రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ నిర్వహిస్తున్నారు. రేపు, ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రపతి కోవింద్ బయలుదేరి వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News