India: ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. పీవోకేలోకి ప్రవేశించి కాల్పులు.. ముగ్గురు పాక్ రేంజ‌ర్లు హ‌తం

  • ఇటీవ‌ల భార‌త సైనికుల ప్రాణాలు తీసిన పాక్‌
  • లోకలైజ్డ్ టాక్టికల్ లెవల్ పేరుతో భార‌త ఆర్మీ ఆప‌రేష‌న్‌
  • ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న‌ పది మంది ప్రత్యేక దళానికి చెందిన భారత ఆర్మీ

ఇటీవ‌ల పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్ప‌డి భార‌త సైనికుల ప్రాణాలు తీసిన‌ విష‌యం తెలిసిందే. అందుకు భార‌త్‌ ప్రతీకారం తీర్చుకుంది. భారత ఆర్మీ ఎల్వోసీ దాటి పాక్ దళాలకు గట్టిగా బుద్ధి చెప్పింది. భార‌త బ‌ల‌గాలు జ‌రిపిన‌ కాల్పుల్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు హ‌త‌మ‌య్యారు. మరో పాక్‌ సైనికుడికి గాయాల‌య్యాయి. ఈ ఆపరేషన్‌ను లోకలైజ్డ్ టాక్టికల్ లెవల్ ఆపరేషన్ అనే పేరుతో నిర్వ‌హించారు. సుమారు పది మంది ప్రత్యేక దళానికి చెందిన భారత ఆర్మీ ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొంది. ఈ ఆపరేషన్‌ సర్జికల్ స్ట్ర‌యిక్స్ కాద‌ని  అధికారులు వివ‌రించారు. ఇందులో భార‌త సైనికుల‌కు ఎటువంటి గాయాలూ కాలేదు.     

  • Loading...

More Telugu News