YSRCP: క‌ర్నూలు స్థానిక సంస్థల ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటున్నాం: వైసీపీ సంచ‌ల‌న‌ ప్రక‌ట‌న

  • విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేయాల‌న్నదే మా ల‌క్ష్యం
  • టీడీపీ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
  • ఆ పార్టీ మ‌రోసారి డ‌బ్బుల‌తో ప్ర‌జాస్వామ్యాన్ని కొనుగోలు చేయ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం

క‌ర్నూలు స్థానిక సంస్థల ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని వైసీపీ ప్రక‌ట‌న చేసింది. కర్నూలు జిల్లా వైసీపీ నేత‌లు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ఈ విష‌యాన్ని తెలిపారు. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేయాల‌న్నదే త‌మ‌ ల‌క్ష్యమ‌ని వైసీపీ నేత బీవై రామ‌య్య‌ చెప్పుకొచ్చారు. టీడీపీ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఆ పార్టీ మ‌రోసారి డ‌బ్బుల‌తో ప్ర‌జాస్వామ్యాన్ని కొనుగోలు చేయ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. త‌మ పార్టీ ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ తాము పోటీ చేయ‌ట్లేదని అన్నారు.       

  • Loading...

More Telugu News