Telugudesam: టీడీపీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో పేకాట దందా!

  • కోట్ల రూపాయల్లో సాగుతున్న దందా
  • మందు, విందు ఏర్పాట్లు
  • పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు 

కృష్ణా జిల్లా కైకలూరులోని టీడీపీ నేత, ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో జోరుగా పేకాట దందా నడుస్తోంది. కోట్ల రూపాయల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో మందు, విందు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన మాగంటి బాబు కార్యాలయంలో, ఆయన అండతోనే ఈ వ్యవహారం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బయటివ్యక్తులకు అనుమానం రాకుండా తమ వాహనాలను పేకాట ఆడే ప్రాంతానికి దూరంగా పార్కింగ్ చేస్తున్నట్టు సమాచారం. వారానికి కోట్ల రూపాయల్లో సాగే ఈ దందాలో పింక్, ఎల్లో, గ్రీన్ కాయిన్స్ నే డబ్బుగా పరిగణిస్తున్నారని తెలుస్తోంది. క్రికెట్ బుకీలు, ఫైనాన్స్ నిర్వహించే వ్యక్తులు సహా ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పేకాటరాయుళ్లు ఇక్కడికి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇంత వ్యవహారం జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదని స్థానికుల సమాచారం.

  • Loading...

More Telugu News