Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ముచ్చటించిన సీఎం కేసీఆర్!

  • రాజ్ భవన్ లో విందుకు హాజరైన పవన్ కల్యాణ్
  • పవన్ తో ముచ్చటించిన కేసీఆర్
  • అన్నయ్య చిరంజీవితో మాట్లాడిన పవన్

శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రెండు రాష్ట్రాల మంత్రులు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పనవ్ కల్యాణ్ తో సీఎం కేసీఆర్ కొంచెం సేపు ముచ్చటించారు. కాగా, ఈ విందుకు చిరంజీవి కూడా హాజరయ్యారు. అన్నయ్య చిరంజీవిని తమ్ముడు పవన్ కలిశారు. పరస్పరం ముచ్చటించుకున్నారు. వీరిద్దరూ కొంచెం సేపు సందడి చేశారు.

  • Loading...

More Telugu News