new year: న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రెండు కొత్త ప్లాన్ల‌ను ప్ర‌క‌టించిన జియో!

  • రూ. 199, రూ. 299 రీఛార్జీల‌తో ఆఫ‌ర్‌
  • 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్‌
  • ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ల‌కు పోటీగా?

న్యూఇయ‌ర్ అన‌గానే ఆఫ‌ర్ల వ‌ర్షం కురుస్తుంటుంది. అందుకు టెలికాం కంపెనీలు కూడా మిన‌హాయింపు కాదు. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్, వొడాఫోన్ సంస్థ‌లు రూ. 199 రీఛార్జీ ప్లాన్ల‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ బాట‌లోనే రిల‌య‌న్స్ జియో కూడా రెండు కొత్త న్యూఇయ‌ర్ రీఛార్జీ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

రూ. 199, రూ.299 ప్లాన్ల‌ను జియో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులు. ఈ రెండింటిలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ ల‌భిస్తాయి. కాకపోతే డేటా విష‌యంలో ఈ రెండు ప్లాన్ల‌లో చిన్న తేడా ఉంది. రూ.199 ప్లాన్‌లో రోజుకు 1.2 జీబీ డేటా లభిస్తుండ‌గా, రూ.299 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ సంస్థ‌లు విడుద‌ల చేసిన ప్లాన్ల‌కు పోటీగా జియో ఈ కొత్త రీఛార్జీల‌ను ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News