India: టాస్ గెలిచిన శ్రీలంక.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా!

  • ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో శ్రీలంక‌, భార‌త్ రెండో టీ20
  • మొద‌టి టీ20లో శ్రీలంక ఓట‌మి
  • టీమిండియాలో మార్పుల్లేవ్‌..
  • శ్రీలంక జ‌ట్టులో రెండు మార్పులు

కటక్‌లో జరిగిన మొద‌టి టీ 20లో శ్రీలంక‌పై టీమిండియా 93 పరుగులతో గెలిచి రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో టీ20 ఆడుతోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో జ‌రుగుతోన్న టీ20 లో టాస్ గెలిచిన శ్రీలంక మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియాలో ఎటువంటి మార్పుల్లేవు.

కాగా, శ్రీలంక జ‌ట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీలంక జ‌ట్టులో నిరోషన్‌ డిక్వెలా, ఉపుల్‌ తరంగ, కుశాల్‌ పెరీరా, ఏంజెలో మాథ్యూస్‌, సదీర సమరవిక్రమ, ఆసేల గుణరత్నె, తిసారా పెరీరా, చతురంగ డిసిల్వా, అఖిల ధనంజయ, చమీరా, ప్రదీప్ ఉన్నారు. క్రీజులోకి ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, లోకేశ్ రాహుల్ వ‌చ్చారు.

  • Loading...

More Telugu News