rahul gandhi: తొలిసారి రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ భేటీ.. సోనియా, మ‌న్మోహ‌న్ హాజ‌రు

  • ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో భేటీ
  • 2జీ కేసులో తీర్పు, పార్ల‌మెంటు స‌మావేశాల‌పై చ‌ర్చ‌
  • పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే విష‌యంపై అభిప్రాయాల సేక‌ర‌ణ‌

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ అధ్య‌క్ష‌త‌న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ తొలిసారి ఈ రోజు భేటీ అయింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో కొన‌సాగుతోన్న ఈ స‌మావేశానికి సోనియా గాంధీ, మ‌న్మోహ‌న్ సింగ్‌తో పాటు ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు హాజ‌రయ్యారు. 2జీ కేసులో తీర్పు, పార్ల‌మెంటు స‌మావేశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం చోటు చేసుకుంటోన్న రాజ‌కీయ ప‌రిణామాలు, త‌దుప‌రి త‌మ పార్టీ ఎలా ముందుకు వెళ్లాల‌న్న వాటిపై కూడా చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. 

  • Loading...

More Telugu News