ntr: ఎన్టీఆర్ మూవీలో ఆ ఇద్దరు హీరోయిన్స్ లేరట!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • న్యూ లుక్ కోసం కసరత్తు
  • హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ నిర్ణయమే ఫైనల్

ప్రస్తుతం త్రివిక్రమ్ .. 'అజ్ఞాతవాసి' సినిమాతో బిజీగా వున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఆయన వున్నాడు. జనవరి చివరివారంలో ఆయన ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాలో న్యూ లుక్ కోసం ఎన్టీఆర్ కసరత్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అనూ ఇమ్మాన్యుయేల్ ను ఓకే చేసినట్టుగా కూడా ప్రచారం జరిగింది.

అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదనీ .. ఇంతవరకూ కథానాయికగా ఎవరినీ అనుకోలేదనేది తాజా సమాచారం. కథానాయికగా ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ నిర్ణయానికి వదిలేశాడట. అందువలన ఆయన ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాక, హీరోయిన్ గురించిన ఆలోచన చేద్దామనే ఉద్దేశంతో వున్నాడట. అప్పుడు ఎవరిని తీసుకుంటారో .. ఆ అదృష్టవంతురాలెవరో చూడాలి.   

  • Loading...

More Telugu News