Jagan: మహిళను వివస్త్రను చేసిన ఘటన అత్యంత దారుణం: జ‌గ‌న్‌

  • విశాఖ‌ప‌ట్నం పెందుర్తిలో టీడీపీ నేత‌లు రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తించారు
  • మాన‌వ‌త్వం మరచి ద‌ళిత మ‌హిళ చీరను చింపారు
  • ద‌ళితుల‌ భూమిని లాక్కోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది
  • చంద్ర‌బాబు అండ‌తో టీడీపీ నేత‌లు ఇలా చేశారు

మహిళను వివస్త్రను చేసిన ఘ‌ట‌న‌ జరగడం అత్యంత దారుణమ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ విష‌యంపై తాను పాద‌యాత్ర‌లో మాట్లాడగా తీసిన వీడియోను జ‌గ‌న్ పోస్ట్ చేశారు.

"విశాఖ‌ప‌ట్నం పెందుర్తిలో మాన‌వ‌త్వం మరచిపోయి రాక్ష‌సులుగా టీడీపీ నాయ‌కులు ఒక ద‌ళిత మ‌హిళ‌ను అంద‌రూ చూస్తుండ‌గా చీర చింపి అవ‌మానించారు. ఆ ద‌ళిత మ‌హిళ చేసిన త‌ప్పేమిట‌ని నేను పేప‌ర్‌ చ‌దివాను. ప్ర‌భుత్వం ద‌ళితుల‌కు ఒక ఎక‌రం స్థ‌లం ఇచ్చింది. మ‌ళ్లీ ఆ భూమిని లాక్కోవాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. కోర్టులో ద‌ళితుల‌కు అనుకూలంగా ఉత్త‌ర్వులు వ‌చ్చాయి. దీంతో బ‌లవంతంగా ద‌ళితుల‌ను ఖాళీ చేయించ‌డానికి వెళ్లి టీడీపీ నేత‌లు ఇలా చేశారు. చంద్ర‌బాబు నాయుడు త‌మ వెనుక ఉన్నాడ‌న్న అహంకారంతో ఇలా ప్ర‌వ‌ర్తించారు. ఇదేం పాల‌నా?" అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News