Sai Naik: హైదరాబాద్ పబ్‌లో కేంద్ర మాజీ మంత్రి కుమారుడి హల్‌చల్.. కేసు నమోదు!

  • ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
  • బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
  • విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో కేంద్రమాజీ మంత్రి కుమారుడు హల్‌చల్ చేశాడు. పబ్‌కు వచ్చిన ఓ యువకుడి చేయి పొరపాటున అతడికి తాకడంతో మంత్రి కుమారుడు సాయి నాయక్ వెర్రెత్తిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ అతడిని దుర్బాషలాడాడు. అంతటితో ఆగక చేయి చేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

జూబ్లీహిల్స్ రోడ్  నంబరు 36లోని ఓ పబ్‌కు అదే ప్రాంతానికి చెందిన కల్యాణ్  తన స్నేహితులతో వెళ్లాడు. తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున అతడి చేయి మాజీ మంత్రి కుమారుడు సాయి నాయక్‌కు తగిలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కల్యాణ్‌పై దాడికి దిగాడు. దీంతో బాధితుడు నేరుగా వెళ్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News