Cricket: టీ20 అప్ డేట్స్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

  • క‌టక్ వేదిక‌గా భారత్‌, శ్రీలంక మ‌ధ్య మొద‌టి టీ20
  • ఇటీవ‌లే వ‌న్డే సిరీస్‌లో శ్రీలంక ప‌రాజ‌యం
  • టీ20లో రాణించాల‌ని ప‌ట్టుద‌ల‌తో లంక టీమ్‌  

క‌టక్ వేదిక‌గా మ‌రికాసేప‌ట్లో భారత్‌, శ్రీలంక మ‌ధ్య మొద‌టి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన‌ వ‌న్డే సిరీస్‌లో శ్రీలంకను భార‌త్ చిత్తు చేసిన విష‌యం తెలిసిందే. టీ20ల్లోనూ అదే దూకుడును కొన‌సాగించాల‌ని టీమిండియా భావిస్తోంది. మ‌రోవైపు టీ20ల్లోన‌యినా గెలిచి తీరాల‌ని శ్రీలంక ప‌ట్టుద‌ల‌తో ఉంది.

టీమిండియా: రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌, దినేశ్ కార్తీక్‌, మ‌నీశ్ పాండే, ధోనీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ జాద‌వ్‌, బుమ్రా, జ‌య్‌దేవ్ ఉన‌ద్‌క‌ట్‌, చాహెల్‌.

శ్రీలంక జట్టు: ఉపుల్ త‌రంగ‌, నిరోష‌న్ డిక్‌వెల్లా, కుస‌ల్‌ పెరెరా, తిసర పెరెరా (కెప్టెన్‌), మాథ్యూస్‌, గుణ‌ర‌త్నే, ష‌న‌క‌, చ‌మీరా, ఫెర్నాండో, ధ‌జంజ‌య‌, ప్ర‌దీప్.

  • Loading...

More Telugu News