Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • పారితోషికం గురించి రకుల్ మాట 
  • 'జైసింహా' ఆడియో వేడుక అప్ డేట్స్ 
  • అఖిల్ 'హలో'కి సెన్సార్ పూర్తి
  • 'అదే నువ్వు అదే నేను' అంటున్న దిల్ రాజు

*  'సినిమాలో మన పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి పారితోషికం వుంటుంది' అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. "మొదటి నుంచీ కూడా మన సినిమాలు హీరోల ఇమేజ్ పైనే ఆధారపడి నిర్మితమవుతున్నాయి. అటువంటప్పుడు వాళ్లకు ఎక్కువ పారితోషికం వుండడంలో తప్పులేదు. మన పాత్రకు తగ్గట్టుగా మనకుంటుంది. ఈ విషయంలో మార్పు రావాలంటే ఒక్కసారిగా వచ్చేయదు" అని చెప్పింది.      
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జైసింహా' ఆడియో వేడుకను ఈ నెల 24న విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఆ రోజు సాయంకాలం నగరంలోని వజ్ర గ్రౌండ్స్ లో ప్రముఖుల సమక్షంలో వేడుక ఘనంగా జరగనుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారు.
*  అఖిల్ అక్కినేని హీరోగా నటించిన రెండో చిత్రం 'హలో' సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ ను జారీ చేసింది. విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 22న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
*  వరుస సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'అదే నువ్వు అదే నేను' అనే టైటిల్ని ఖరారు చేశారు. దీని ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కానున్నాడు.   

  • Loading...

More Telugu News