hema: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ రోజూ తాను కాపున‌ని చెప్పుకోలేదు!: సినీ న‌టి హేమ

  • కాపుల‌కు మ‌ద్దతు ప‌లుకుతున్నార‌ని కొంద‌రు అంటున్నారు
  • తాను కాపున‌ని చెప్పుకోవ‌డానికి ప‌వ‌న్‌ ఇష్ట‌ప‌డ‌రు
  • మనుషులందరూ ఒక‌టే అని ప‌వ‌న్ అంటారు

సినీన‌టుడు, జ‌నసేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కాపుల‌కు మ‌ద్దతు ప‌లుకుతున్నార‌ని కొంద‌రు అంటున్నారని, అదేమీ లేద‌ని సినీ న‌టి హేమ అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె... తాను కాపుల‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించానని, కాపుల పోరాటంలో మెంబ‌ర్‌గా ఉన్నానని చెప్పారు. ఓ సారి కాపుల విష‌యంపై జ‌రిగిన చ‌ర్చ‌లో తాను పాల్గొన్నానని అన్నారు. కాపుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నాడు క‌దా? అని తాను ఒకసారి కాపు పెద్ద‌ల‌ని అడిగానని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ది కాపు వ‌ర్గం అని చెప్పుకోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌డం లేదని వారి నుంచి స‌మాధానం వ‌చ్చింద‌ని అన్నారు.
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ రోజు కూడా తాను కాపున‌ని చెప్పుకోలేదని హేమ అన్నారు. మనుషులందరూ ఒక‌టే అని ప‌వ‌న్ అంటార‌ని హేమ తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తే కాపుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తాము ఏమీ అనుకోవ‌డం లేద‌ని కూడా హేమ అన్నారు.

  • Loading...

More Telugu News