Mahesh Babu: వచ్చే నెలలో 'భరత్ అనే నేను' పాటల చిత్రీకరణ .. రిలీజ్ డేట్ లో మార్పు లేదట!

  • 'కారైకుడి'కి కొరటాల టీమ్ 
  • ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ 
  • ముందుగా చెప్పినట్టుగానే ఏప్రిల్ 27న రిలీజ్        

మహేశ్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' చివరి షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకూ తమిళనాడులోని 'కారైకుడి'లో ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చేనెలలో ఒక ఫైట్ ను .. 3 పాటలను చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు. అదే రోజున ' నా పేరు సూర్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అప్పటికే '2.0' థియేటర్స్ లో ఉంటుంది. అందువలన ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చనున్నారనీ, రెండు వారాల ముందుగానే విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఈ సినిమా టీమ్ స్పందించింది. ఈ సినిమా రిలీజ్ డేట్  విషయంలో మార్పు జరగనున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదనీ, ముందుగా చెప్పినట్టుగానే ఏప్రిల్ 27వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతుందని స్పష్టం చేశారు.        

  • Loading...

More Telugu News