Jagan: 'సీఎం అవుతాను.. అప్ప‌టివ‌ర‌కు ఆగండి, ప‌నులు చేస్తా'నంటే కుద‌ర‌దు!: జ‌గ‌న్‌పై ప‌వ‌న్ సెటైర్

  • రాజ‌కీయం అంటే సీఎం కావ‌డం కాదు
  • సామాజిక మార్పు చేయ‌డ‌మే రాజ‌కీయం
  • ప్ర‌తిప‌క్షం ఉన్నా ప్ర‌భుత్వంతో ఎన్నో ప‌నులు చేయించ‌వ‌చ్చు
  • సైద్ధాంతిక బ‌లంతో జ‌న‌సేన పార్టీ పెట్టా

రాజ‌కీయం అంటే సీఎం కావ‌డం కాదని, సామాజిక మార్పు చేయ‌డ‌మే రాజ‌కీయమ‌ని ప‌రోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌ని ఉద్దేశించి సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. 'సీఎం అవుతాను.. అప్ప‌టివ‌ర‌కు ఆగండి ప‌నులు చేస్తానంటే కుద‌ర‌ద'ని అన్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ప్ర‌భుత్వంతో ఎన్నో ప‌నులు చేయించ‌వ‌చ్చని హిత‌వు ప‌లికారు.

కాగా, ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ లాంటి కమిట్‌మెంట్ లేని వ్య‌క్తులు జ‌న‌సేన‌లో ఉండ‌కూడ‌దని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అన్నారు. సైద్ధాంతిక బ‌లంతో తాను జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని, గ‌తంలో బాగా ఆలోచించే బీజేపీ, టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపాన‌ని అన్నారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి వంద‌ల కోట్లు ఇచ్చేవారు లేర‌ని, ఒక వేళ ఇచ్చినా తాను అటువంటి వారిని పార్టీలోకి తీసుకోన‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు ఒక‌రికొకరు అవినీతిపై పుస్త‌కాలు వేసుకున్నాయ‌ని అన్నారు. రాష్ట్ర ప‌రిస్థితులు ఇలా ఉంటే పెట్టుబ‌డులు ఎలా పెడ‌తామ‌ని త‌న‌ను లండ‌న్‌లో కొంద‌రు అడిగార‌ని చెప్పారు. డ‌బ్బు లేక‌పోయినా రాజ‌కీయాలు చేయ‌వ‌చ్చ‌ని తాను నిరూపిస్తాన‌ని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News