Pawan Kalyan: రేపు ఉద‌యం పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ద్దకు ప‌వ‌న్ క‌ల్యాణ్!

  • విశాఖ‌ప‌ట్నం ప‌ర్య‌ట‌న ముగించుకున్న జ‌న‌సేనాని
  • రాజ‌మ‌హేంద్రవ‌రం చేరుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్
  • రేపు మ‌ధ్యాహ్నం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లతో ప‌వ‌న్ భేటీ

విశాఖ‌ప‌ట్నం ప‌ర్య‌ట‌న‌ను ముగించుకున్న జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌మ‌హేంద్రవ‌రం చేరుకున్నారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల అంశం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఉద‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించ‌నున్నారు.

అనంత‌రం స్థానిక జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లతో ఆయన స‌మావేశం అవుతారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాల‌పై ప‌వ‌న్ త‌మ కార్యక‌ర్త‌ల‌కు సూచ‌న‌లు చేస్తారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌య‌న‌గ‌రంలోనూ ప‌ర్య‌టించే అవ‌కాశం ఉంది.

  • Loading...

More Telugu News