Cricket: భార‌త్‌-శ్రీలంక టెస్టు డ్రా .. సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా!

  • 1-0 తో సిరీస్ భార‌త్ కైవసం
  • వ‌రుస‌గా 9 టెస్టు సిరీస్‌ల‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్
  • ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డుని స‌మం

ఢిల్లీలో జ‌రుగుతోన్న భార‌త్‌, శ్రీలంక‌ మూడో టెస్టు మ్యాచు డ్రాగా ముగిసింది. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌లో మొద‌టి, మూడో టెస్టు డ్రాగా ముగియ‌గా, రెండో టెస్టును టీమిండియా గెలుచుకుంది. మూడో టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ క‌రుణ ర‌త్నే13, స‌మ‌ర‌విక్ర‌మ 5, ధ‌నంజ‌య 119, లక్మ‌ల్ 0, మాథ్యూస్ 1, చండిమాల్ 36, రోష‌న్ 74(నాటౌట్‌), డిక్‌వెల్ల 44 (నాటౌట్‌) ప‌రుగులు చేశారు.

మోడో టెస్టులో భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 536, రెండో ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. శ్రీలంక మొద‌టి ఇన్నింగ్స్‌లో 373, రెండో ఇన్నింగ్స్‌లో 299 ప‌రుగులు చేసింది. ఈ సిరీస్ విజ‌యంతో టీమిండియా వ‌రుస‌గా 9 టెస్టు సిరీస్‌ల‌ను కైవ‌సం చేసుకుని, ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డుని స‌మం చేసింది.   

  • Loading...

More Telugu News