Cricket: మూడో టెస్టు: ముగిసిన నాలుగో రోజు ఆట‌.. శ్రీలంక‌ 31/3

  • 379 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉన్న శ్రీలంక‌
  • క్రీజులో ధ‌నంజ‌య (13), మాథ్యూస్ (0)
  • రేపు తేల‌నున్న ఫ‌లితం

ఢిల్లీలో జ‌రుగుతోన్న మూడో టెస్టు మ్యాచులో నాలుగో రోజు టీమిండియా ఆట‌గాళ్లు రాణించారు. ఐదు వికెట్లు కోల్పోయిన అనంత‌రం భార‌త్ రెండో ఇన్నింగ్స్ ను 246 ప‌రుగుల వ‌ద్ద డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే. 410 ప‌రుగుల‌ విజ‌యల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక వెను వెంట‌నే మూడు వికెట్లు కోల్పోయింది.

 క‌రుణ ర‌త్నే13, స‌మ‌ర‌విక్ర‌మ 5, లక్మ‌ల్ 0 ప‌రుగులు చేసి అవుట్ అయ్యారు. క్రీజులో ధ‌నంజ‌య 13, మాథ్యూస్ 0 ఉన్నారు. మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 536 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. మొద‌టి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 373 ప‌రుగులు చేసింది. శ్రీలంక ఇంకా 379 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఫ‌లితం రేపు తేలిపోనుంది. 

  • Loading...

More Telugu News