keerthi suresh: రేపే సావిత్రి జయంతి .. స‌ర్‌ప్రైజ్ చేయనున్న 'మహానటి' టీమ్

  • తెలుగు .. తమిళ భాషల్లో 'మహానటి'
  • ముగింపు దశకి చేరుకున్న షూటింగ్  
  • సినిమా నుంచి రేపు ఆసక్తికరమైన అప్డేట్

దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సావిత్రి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రేపు సావిత్రి  జయంతి .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీమ్ ఒక స‌ర్‌ప్రైజ్ ను ఇవ్వడానికి ప్లాన్ చేసిందట. అది పోస్టరా .. టీజరా అనే విషయాన్ని సస్పెన్స్ లో ఉంచారు. మొత్తానికి ఓ ఆసక్తికరమైన అప్డేట్ మాత్రం రానుందని అంటున్నారు.

 తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. సావిత్రిగా కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, జమున పాత్రను సమంత చేస్తోంది. ఇక సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనుండగా, ఎస్వీఆర్ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. సావిత్రి అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.     

  • Loading...

More Telugu News