raviteja: కల్యాణ్ కృష్ణతోనే రంగంలోకి దిగుతోన్న రవితేజ

  • 'టచ్ చేసి చూడు'తో బిజీగా రవితేజ
  • తరువాత సినిమా కల్యాణ్ కృష్ణతో 
  • ఆలస్యం కానున్న శ్రీను వైట్ల ప్రాజెక్టు  

ప్రస్తుతం రవితేజ .. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా .. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇద్దరిలో శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ముందుగా సెట్స్ పైకి వెళుతుందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి.

అయితే కల్యాణ్ కృష్ణ సినిమానే ముందుగా సెట్స్ పైకి వెళుతుందనేది తాజా సమాచారం. రేపుగానీ .. ఎల్లుండి గాని ఈ సినిమాను ఎనౌన్స్ చేసే ఛాన్స్  ఉందని అంటున్నారు. వెంకట్ తలారి .. రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కథానాయికతో పాటు మిగతా నటీనటులు ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక శ్రీను వైట్ల తన సినిమా కోసం అమెరికాలో లొకేషన్ల వేటలో ఉన్నాడనే సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా ఆయన ప్రాజెక్టు కూడా పట్టాలెక్కనుందన్న మాట.        

  • Loading...

More Telugu News