BJP: బీజేపీ నేత భ‌ర‌త్‌రెడ్డి అవ‌మానించిన ద‌ళిత యువ‌కుల కేసులో మ‌రో కోణం!

  • హైద‌రాబాద్‌లో ద‌ళిత యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మొద‌ట ఓ సినిమా షూటింగ్ కోసమే అలా దెబ్బ‌లు తిన్న‌ట్లు నటించామన్న యువ‌కులు
  • ఇప్పుడు మాట మార్చిన వైనం 

గత నెలలో నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేటలో బీజేపీ మాజీ నేత భరత్ రెడ్డి చేతిలో ఇద్ద‌రు దళిత యువ‌కులు చావుదెబ్బ‌లు తిన్న విష‌యం తెలిసిందే. 20 రోజుల నుంచి క‌నపడ‌కుండా పోయిన ఆ యువ‌కులని పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని విచారించారు. మొద‌ట త‌మ‌ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆ యువ‌కులు చెప్పారు. ఓ సినిమా షూటింగ్ కోసమే అలా దెబ్బ‌లు తిన్న‌ట్లు నటించామని చెప్పుకొచ్చారు.

అయితే, ఇప్పుడు అస‌లు నిజాన్ని బ‌య‌ట‌పెట్టారు. భ‌ర‌త్ రెడ్డి అనుచ‌రుల చేతిలో తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే సినిమా షూటింగ్‌లో నటించామని అసత్యాలు చెప్పామ‌ని అన్నారు. ఓ లాయర్ త‌మ‌ను అలా చెప్పమన్నార‌ని, అందుకే అస‌త్యాలు చెప్పామ‌ని తెలిపారు. అంతేగాక‌, తమ సెల్‌ ఫోన్లు కూడా ఇప్పటికీ భరత్‌ రెడ్డి దగ్గరే ఉన్నాయని ఆ యువ‌కులు చెప్పారు.    

  • Loading...

More Telugu News