Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నితిన్ కి జోడీగా పూజా హెగ్డే 
  • 'రాజారథం'లో రానా కీలకపాత్ర
  • తొలిసారిగా డబ్బింగ్ చెబుతున్న హీరోయిన్
  • విశాల్ కి పాట పాడుతున్న ధనుష్    

*  తాజాగా 'సాక్ష్యం' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ భామ పూజా హెగ్డే త్వరలో నితిన్ సరసన ఓ చిత్రంలో నటించనుంది. 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించే చిత్రం కోసం  పూజా హెగ్డేను బుక్ చేస్తున్నారట.
*  అటు హీరోగా చేస్తూ, అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్లుంటే ఇతర హీరోల చిత్రాలలో కూడా నటిస్తున్న రానా దగ్గుబాటి తాజాగా 'రాజారథ' అనే కన్నడ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అనూప్ భండారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిరూప్ భండారీ, అవంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో దీనిని 'రాజారథం' పేరిట డబ్ చేస్తున్నారు.
*  ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో నటించిన కన్నడ భామ హరిప్రియ తొలిసారిగా ఓ తెలుగు చిత్రానికి డబ్బింగ్ చెబుతోంది. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'జైసింహా' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది.
*  అప్పుడప్పుడు పాటలు కూడా పాడే తమిళ హీరో ధనుష్ తాజాగా మరో హీరో విశాల్ కి కూడా ఓ పాట పాడుతున్నాడు. విశాల్ హీరోగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'పందెం కోడి 2' చిత్రం కోసం ధనుష్ ఓ రొమాంటిక్ నంబర్ ను ఆలపిస్తాడట.     

  • Loading...

More Telugu News