balakrishna: భారీ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తిచేసిన బాలకృష్ణ!

  • రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన భారీ ఫైట్ 
  • 60 మంది ఫైటర్లతో బాలకృష్ణ 
  • టాకీ పార్టు పూర్తి చేసిన టీమ్ 
  • జనవరి 12న విడుదల  

బాలకృష్ణ 102వ చిత్రంగా 'జై సింహా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తూ వస్తున్నారు. బాలకృష్ణ - అశుతోష్ రానా తో పాటు 60 మంది ఫైటర్లు పాల్గొనగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.

రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ .. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగును పూర్తిచేయడంతో .. టాకీ పార్టు పూర్తయిందని దర్శక నిర్మాతలు చెప్పారు. నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ఈ సినిమాకి కూడా కలిసొస్తుందేమో చూడాలి.         

  • Loading...

More Telugu News