Mahesh Babu: ఫ్యాన్సీ రేటుకు 'భరత్ అనే నేను' ఆడియో రైట్స్

  • షూటింగ్ దశలో 'భరత్ అనే నేను' 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్
  • లహరి సంస్థకి ఆడియో రైట్స్ 
  • ఏప్రిల్ 27న సినిమా రిలీజ్  

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన జోడీగా కైరా అద్వాని కనిపించనుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట.

 అందువలన లహరి మ్యూజిక్ వారు ఫ్యాన్సీ రేటు చెల్లించి, ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ నిన్ననే హైదరాబాద్ లో మొదలైంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనుండటం .. 'శ్రీమంతుడు' తరువాత కొరటాలతో మహేశ్ చేస్తోన్న ప్రాజెక్టు కావడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.     

  • Loading...

More Telugu News