company: నాగార్జున పక్కన హీరోయిన్ గా కొత్తమ్మాయి... ఫొటోలు చూపిన రాంగోపాల్ వర్మ!

  • 'కంపెనీ' హీరోయిన్ గా కొత్తమ్మాయి
  • మైరా సరీన్ ను పరిచయం చేస్తున్నాం
  • ఫేస్ బుక్ లో ఫొటోలు చూపిన వర్మ

నాగార్జున హీరోగా తాను తీస్తున్న 'కంపెనీ' చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో రాంగోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఆమె చిత్రాలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. మైరా సరీన్ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్టు చెప్పాడు.

"నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్న దానిపై మీడియాలో రక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి..అవన్నీ తప్పు.. హీరోయిన్ గా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి.. తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివే" అని చెప్పుకొచ్చాడు. మైరా సరీన్ చిత్రాలను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News