raj tarun: త్వరలో సెట్స్ పైకి రాజ్ తరుణ్ 'లవర్'

  • రాజ్ తరుణ్ హీరోగా 'లవర్'
  • కథానాయికగా గాయత్రి సురేష్  
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్ 
  • ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచన

ఒక వైపున 'రంగుల రాట్నం' సినిమాతోను .. మరో వైపున 'రాజుగాడు' సినిమాతోను ప్రేక్షకులను పలకరించడానికి రాజ్ తరుణ్ రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు కూడా తనకి హిట్స్ ను అందిస్తాయనే ఉత్సాహంతో వున్నాడు. ఈ నేపథ్యంలో మరో సినిమాను చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనుంది.

దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించే ఈ సినిమాలో, రాజ్ తరుణ్ సరసన గాయత్రి సురేశ్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమాకి 'లవర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బైక్ మెకానిక్ పాత్రలో రాజ్ తరుణ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడట. క్రితం నెలలోనే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. చకచకా షూటింగును కానిచ్చేసి .. ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.      

  • Loading...

More Telugu News