onion: దేశ వ్యాప్తంగా భారీగా పెరిగిన ఉల్లి ధ‌ర‌లు!

  • దేశ రాజ‌ధాని ఢిల్లీలో కిలో ఉల్లిధ‌ర‌ రూ.80
  • ఇత‌ర మెట్రోన‌గ‌రాల్లో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.70
  • క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, మధ్య‌ప్ర‌దేశ్‌ల నుంచి త‌గ్గిపోయిన దిగుమ‌తి

ఉల్లి ధ‌ర‌లు క‌న్నీరు పెట్టిస్తున్నాయి. న్యూఢిల్లీలోని అతిపెద్ద ఆజాద్‌పూర్‌ మండీలో ఈ రోజు కిలో ఉల్లి ధ‌ర రూ.80గా న‌మోదైంది. దేశంలోని మిగ‌తా మెట్రో నగరాల్లో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.70 ప‌లుకుతోంద‌ని రిటైల్‌ వ్యాపారులు అంటున్నారు. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, మధ్య‌ప్ర‌దేశ్‌ల నుంచి ఉల్లి దిగుబ‌డి త‌గ్గిపోవ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని చెబుతున్నారు. మ‌హారాష్ట్ర‌లోని లాసాల్గావ్‌ మండీకి ఉల్లి సరఫరాలు 12,000 క్వింటాళ్లకు పడిపోయాయని పేర్కొన్నారు. గత ఏడాది ఈ స‌మ‌యంలో ఈ మార్కెట్‌కు 22,933 క్వింటాళ్ల సరుకు వచ్చింది.     

  • Loading...

More Telugu News