Narendra Modi: హైద‌రాబాదీయుల క‌ల‌ల‌బండి మెట్రోరైల్ ప్రారంభం.. ప్ర‌యాణిస్తోన్న మోదీ, న‌ర‌సింహ‌న్‌, కేసీఆర్

  • పైలాన్‌ను ఆవిష్క‌రించిన అనంత‌రం మెట్రోరైల్‌పై బ్రోచ‌ర్‌, దృశ్య‌మాలిక విడుద‌ల‌
  • మెట్రోరైల్‌లో కూక‌ట్‌ప‌ల్లి బ‌య‌లుదేరిన మోదీ
  • తిరిగి అదే రైల్లో మియాపూర్‌కి

రాజ‌ధాని వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క‌ల‌ల బండి మెట్రోరైల్ ప్రారంభమైంది. మియాపూర్‌లో మెట్రోరైల్ పైలాన్‌ను ప్రారంభించిన అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మోట్రోపై రూపొందించిన బ్రోచ‌ర్‌, దృశ్య‌మాలిక‌ను విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో క‌లిసి దృశ్య‌మాలిక‌ను వీక్షించారు.

అనంత‌రం మెట్రోరైల్ ఎక్కి కూక‌ట్‌ప‌ల్లి బ‌య‌లుదేరారు. కాసేప‌ట్లో అక్కడి నుంచి తిరిగి మియాపూర్‌కి మెట్రోరైల్ రానుంది. అనంత‌రం మోదీ హెచ్ఐసీసీకి బ‌య‌లుదేరుతారు.    

  • Loading...

More Telugu News