nani: చెప్పిన తేదీకే 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. వాయిదాపడిన 'ఒక్కక్షణం'?

  • దిల్ రాజు నిర్మాతగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' 
  • వచ్చేనెల 21వ తేదీన విడుదల 
  • అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
  • వచ్చేనెల 23 నుంచి 29కి వాయిదా

దిల్ రాజు నిర్మాణంలో .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా తెరకెక్కింది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. 22 వ తేదీన అఖిల్ 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 23వ తేదీన అల్లు శిరీష్ సినిమా 'ఒక్క క్షణం' రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ భావించారు.

మూడు సినిమాలు ఒక రోజు తేడాతో రావడం వలన థియేటర్స్ విషయంలోను .. వసూళ్ల విషయంలోను ఇబ్బందులు ఎదురవుతాయనీ .. ఒక వారం రోజుల ముందుగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'ని విడుదల చేసుకోమని అల్లు అరవింద్ కోరినట్టుగా వార్తలు వచ్చాయి. దిల్ రాజు ఈ సినిమాను 15 వ తేదీనే రిలీజ్ చేయవచ్చని కూడా చెప్పుకున్నారు. కానీ దిల్ రాజు తన నిర్ణయాన్ని మార్చుకోలేదనేది తాజా సమాచారం. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' వచ్చేనెల 21నే రావడం ఖాయమని తెలిసి, అల్లు అరవింద్ .. 'ఒక్క క్షణం' సినిమాను 29వ తేదీకి వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.    

  • Loading...

More Telugu News