balakrishna: 'గాయత్రి' షూటింగులో మోహన్ బాబు .. సెట్లో సందడి చేసిన బాలయ్య

  • మోహన్ బాబు తాజా చిత్రంగా 'గాయత్రి' 
  • రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్
  • అక్కడికి వచ్చిన బాలకృష్ణ 
  • మోహన్ బాబుతో ముచ్చట్లు      

ఎన్టీఆర్ ఫ్యామిలీతో మోహన్ బాబుకి ఎంతో అనుబంధం వుంది. బాలకృష్ణతో ఆయనకి ఎంతో సాన్నిహిత్యం వుంది. అందువల్లనే మోహన్ బాబు తాజా చిత్రం సెట్ కి వెళ్లిన బాలకృష్ణ అక్కడ సందడి చేశారు. ఈ మధ్య కాలంలో తనకి బాగా నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తోన్న మోహన్ బాబు .. తాజాగా 'గాయత్రి' అనే సినిమా చేస్తున్నారు. మదన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను నిన్న అక్కడ చిత్రీకరిస్తున్న సమయంలో హఠాత్తుగా అక్కడికి బాలకృష్ణ వెళ్లారట. ఆయన రాక పట్ల యూనిట్ సభ్యులంతా ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశారు. మోహన్ బాబుతోను .. యూనిట్ సభ్యులతో కాసేపు బాలయ్య ముచ్చటించారు. ఈ సినిమా విశేషాలను గురించి అడిగి తెలుసుకున్న బాలయ్య, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం.    

  • Loading...

More Telugu News