rajasekhar: నేను తాగేసి యాక్సిడెంట్ చేయలేదు .. ఆ రోజు జరిగింది అది: రాజశేఖర్

  • కోపంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చాను 
  • నేను తీసిన కారు ఆ రోజే రిపేరుకు వెళ్లి వచ్చింది కానీ బ్రేకులు సరిగ్గా పడటం లేదు
  • ముందుగానే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకున్నాను

ఈ మధ్య రాజశేఖర్ తాగేసి డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడంటూ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేసింది. "అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ నుంచి ఎదురుకావడంతో, రాజశేఖర్ స్పందించారు. "ఆ రోజు నేను .. జీవిత .. ప్రవీణ్ సత్తారు కూర్చుని 'గరుడవేగ' ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను చేసిన సూచనలు జీవితకి నచ్చకపోవడంతో నాకు కోపం వచ్చేసింది. దాంతో చెన్నైకి వెళ్లిపోదామనే ఉద్దేశంతో కారు తీసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లాను. ఆ తరువాత నిర్ణయం మార్చుకుని వెనుదిరిగాను" అన్నారు.

 "ఆ కారు ఆ రోజే రిపేరుకు వెళ్లి వచ్చింది .. సరిగ్గా బ్రేకులు పడటం లేదు. దానికి తోడు మా అమ్మ చనిపోయిన తరువాత నేను యాంటీ డిప్రెసివ్ టాబ్లెట్స్ 4 రకాలవి 3 పూటలా వాడుతున్నాను. మెడిసిన్ బ్యాగ్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. కోపం తగ్గడం కోసం రాత్రి వేసుకోవలసిన టాబ్లెట్ కూడా ముందుగానే వేసేసుకున్నాను. ఒక చోట నేను కారు ఆపగా .. ఆ వ్యక్తి తన కారును తీసుకొచ్చి నా కారు ముందు ఆపాడు. నేను కారు తీస్తుండగా .. ఆయన కారుకు తగిలింది. నేను వేసుకున్న నిద్రమాత్ర పనిచేస్తుండటం వలన .. కారు బ్రేక్ సరిలేనందున అలా జరిగింది. అంతేగానీ .. నిజంగానే నేను తాగలేదు .. ఆ విషయం పోలీసులు చేసిన టెస్టులోను తేలింది" అని అసలు విషయం చెప్పుకొచ్చారు.  

  • Loading...

More Telugu News