ysrcp flag: వైసీపీ జెండాను జగన్ ఆవిష్కరించిన 24 గంటల్లోనే జెండా పైపును కోసేశారు!

  • ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన
  • నారాయణరెడ్డిని హత్య చేసినవారే ఈ పనులు చేయిస్తున్నారన్న వైసీపీ
  • పోలీస్ పికెటింగ్ ఉన్నా.. ఘాతుకం జరిగిందన్న శ్రీదేవి

పాదయాత్రలో భాగంగా శనివారం నాడు కర్నూలు జిల్లా చెరుకులపాడులో వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే జెండా పైపును కొందరు కోసేశారు. ఆదివారం ఉదయానికల్లా జెండా కనిపించకుండా చేశారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఇది ముమ్మాటికీ వైసీపీ నేత నారాయణరెడ్డిని హత్య చేసిన నిందితుల పనే అని ఈ సందర్భంగా వైసీపీ నేత చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు.

పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి ఈ ఘటనపై మాట్లాడుతూ, తమ ప్రత్యర్థులే ఇలాంటి చిల్లర పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఉందని... అయినా ఇలాంటి ఘాతుకాలు చోటు చేసుకోవడం దారుణమని అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని... మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. 

  • Loading...

More Telugu News