Virat Kohli: అర్ధ శ‌త‌కం బాదిన రోహ‌త్ శ‌ర్మ‌.. ద్విశ‌త‌కం దిశ‌గా విరాట్‌ కోహ్లీ!

  • టీ విరామం.. టీమిండియా స్కోరు 507/4 (157 ఓవ‌ర్ల‌కి)
  • క్రీజులో  కోహ్లీ (170), రోహిత్ శ‌ర్మ (51)
  • శ్రీలంక బౌల‌ర్ల‌లో గామేజ్, హెర‌త్‌, ష‌న‌క‌, పెరెరాల‌కు త‌లో వికెట్

నాగ్‌పూర్ వేదిక‌గా జ‌రుగుతోన్న శ్రీలంక-భార‌త్ టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఇర‌గ‌దీస్తున్నారు. 193 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సుతో కోహ్లీ.. 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 98 బంతుల్లో రోహిత్ శ‌ర్మ‌.. 5 ఫోర్లు 1 సిక్సుతో అర్ధ శ‌త‌కం బాదాడు. భార‌త బ్యాట్స్‌మెన్‌లో లోకేశ్ రాహుల్ 7, ముర‌ళీ విజ‌య్ 128,  చ‌టేశ్వ‌ర్ పుజారా 143,  ర‌హానె 2 ప‌రుగులు చేశారు. ప్ర‌స్తుతం క్రీజులో కోహ్లీ 170, రోహిత్ శ‌ర్మ 51 ప‌రుగుల‌తో ఉన్నారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో గామేజ్, హెర‌త్‌, ష‌న‌క‌, పెరెరాల‌కు త‌లో వికెట్ ల‌భించాయి. టీ విరామం నాటికి టీమిండియా స్కోరు 507/4 (157 ఓవ‌ర్ల‌కి) గా ఉంది.

  • Loading...

More Telugu News