Hyderabad: మెట్రోరైల్ ప్రారంభోత్స‌వంపై వీడ‌ని సందిగ్ధ‌త‌.. పీఎంఓ నుంచి ఇంకా సమాచారం లేదన్న కేటీఆర్!

  • ఈ నెల 28న మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
  • పీఎంవో నుంచి ఇప్ప‌టికీ ప్ర‌క‌ట‌న రాలేదు: మ‌ంత్రి కేటీఆర్‌
  • మేము మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాం

హైద‌రాబాదీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రోరైల్ ఎట్ట‌కేల‌కు ఈ నెల 28న ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న‌ విష‌యం తెలిసిందే. ఆ రోజున ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా మెట్రోరైల్ తొలిద‌శ‌ను ప్రారంభించాల‌ని అనుకుంటున్నారు. అయితే, ఆ రోజున మెట్రోరైల్ ప‌రుగులు తీస్తుందా? అన్న సందిగ్ధ‌త ఇప్పటికీ తొల‌గ‌లేదు. హైద‌రాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు వస్తున్న ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారని అనుకున్నారు.

అయితే, ఇప్ప‌టివ‌ర‌కు కూడా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న రాలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము మాత్రం ఎస్పీజీకి వచ్చిన వివరాలతోనే మెట్రో తొలిద‌శ‌ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News