Chandrababu: అలా చేస్తే చంద్ర‌బాబుతో విభేదిస్తాం.. టీడీపీ ఎమ్మెల్యే ప‌ద‌వి నాకు ముఖ్యం కాదు: ఆర్‌.కృష్ణ‌య్య‌

  • ఏపీలో కాపులు అన్ని రంగాల్లోనూ ముందున్నారు
  • బీసీల్లో వారిని క‌ల‌పాల‌ని చూస్తే ఊరుకోబోము
  • బీసీల సంక్షేమం మాత్రమే నాకు ముఖ్యం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాపుల‌ను బీసీ జాబితాలో క‌ల‌పాల‌నుకోవ‌డాన్ని తాము ఒప్పుకోబోమ‌ని బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య అన్నారు. రాజ్యాధికారం కోస‌మే కాపులు త‌మ‌కు బీసీల హోదా కావాల‌ని కోరుతున్నార‌ని తెలిపారు. కాపుల‌ను బీసీల్లో చేర్చితే వెన‌క‌బ‌డిన త‌రగ‌తులకు అన్యాయం జ‌ర‌గ‌దా? అని ప్ర‌శ్నించారు. నిజానికి తెలంగాణ‌లోనే కాపులు వెన‌క‌బ‌డి ఉన్నార‌ని, ఏపీలో కాపులు అన్ని రంగాల్లోనూ ముందున్నార‌ని ఆర్‌.కృష్ణ‌య్య తెలిపారు.

కాపుల‌ను బీసీల్లో చేర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తే తాము ఆయ‌న‌తో విభేదిస్తామ‌ని, త‌న‌కు టీడీపీ ఎమ్మెల్యే ప‌ద‌వి ముఖ్యం కాదని చెప్పారు. బీసీల సంక్షేమం మాత్రమే త‌న‌కు ముఖ్యమ‌ని అన్నారు. ఏపీలో బీసీల సంక్షేమం కోసం ఉద్యమ ప్ర‌ణాళిక రూపొందిస్తున్నామ‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News