stock market: మూడీ రేటింగ్ ప్రభావం.. స్టాక్ మార్కెట్ పరుగు!

  • భారత్ రేటింగ్ ను పెంచిన మూడీస్
  • లాభాల్లో కొనసాగిన మార్కెట్లు 
  • 236 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, భారత మార్కెట్ ను ఆకర్షణీయంగా మార్చాయని చెబుతూ, ప్రస్తుతమున్న 'బీఏఏ3' రేటింగ్ ను 'బీఏఏ2'కు పెంచుతున్నట్టు ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజన్సీ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్' ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు ఎగబాకి 33,343కు పెరిగింది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 10,284కు చేరుకుంది.

బీఎస్ఈ లో ఇవాల్టి టాప్ గెయినర్స్...
శ్రీ రేణుకా షుగర్స్ (13.85%), గతి లిమిటెడ్ (9.83%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (9.51%), అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (8.01%), పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (7.39%).

టాప్ లూజర్స్...
వీడియోకాన్ (-2.73%), టెక్ మహీంద్రా (-2.71%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (-2.69%), గుజరాత్ పిపావావ్ పోర్ట్ (-2.64%), బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ (-2.54%). 

  • Loading...

More Telugu News