Cricket: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

  • కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మొద‌టి టెస్టు మ్యాచ్‌
  • అనుకూలించిన వాతావ‌ర‌ణం
  • ఇరు జ‌ట్ల మ‌ధ్య మొత్తం మూడు టెస్టులు

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతోన్న భార‌త్, శ్రీలంక మొదటి టెస్టు మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక మొద‌ట బౌలింగ్ ఎంచుకుంది. వాతావ‌ర‌ణం అనుకూలించ‌డంతో టాస్ వేశారు. ఇరు జ‌ట్ల‌కు మ‌ధ్య మొత్తం మూడు టెస్టులు జ‌ర‌గ‌నున్నాయి. భార‌త టీమ్‌లో శిఖ‌ర్ ధావ‌న్‌, లోకేశ్ రాహుల్‌, ఛ‌టేశ్వ‌ర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా ర‌హానె, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, ర‌వీంద్ర జ‌డేజా, భువ‌నేశ్వ‌ర్ కుమార్, ఉమేశ్ యాద‌వ్, మొహ‌మ్మ‌ద్ ష‌మీ ఉన్నారు. మంచి ఊపు మీద ఉన్న టీమిండియాను ఓడించాలంటే శ్రీలంక చెమ‌ట కార్చాల్సిందే.     

  • Loading...

More Telugu News