patriji: ప‌త్రీజీకి షాక్ ఇచ్చిన ఓయూ విద్యార్థులు!

  • ఈ రోజు సాయంత్రం ఓయూకి పిరమిడ్ జ్ఞాన కేంద్ర వ్యవస్థాపకుడు పత్రీజీ
  • ఆయ‌న రాక‌ను వ్య‌తిరేకిస్తూ ఓయూ విద్యార్థి సంఘాల ఆందోళ‌న
  • ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబ‌ర్‌లో ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం
  • ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు

హైద‌రాబాద్ తార్నాక‌లోని ఓయూ ఆర్ట్స్ క‌ళాశాల ప్రాంగ‌ణానికి ఈ రోజు సాయంత్రం పిరమిడ్ జ్ఞాన కేంద్ర వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ రావాల్సి ఉంది. ప‌త్రీజీ ఆధ్వ‌ర్యంలో క‌ళాశాల ప్రాంగ‌ణంలో ధ్యాన విద్యార్థి పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఉంది. అయితే, ఆయ‌న రాక‌ను వ్య‌తిరేకిస్తూ ఓయూ విద్యార్థి సంఘాలు ఆందోళ‌న నిర్వ‌హించాయి.

ఈ క్రమంలో పలువురు విద్యార్థులు ఆర్ట్స్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఛాంబ‌ర్‌లోని ఫ‌ర్నీచ‌ర్ ను ధ్వంసం చేశారు. విద్యాల‌యంలోకి ప‌త్రీజీ లాంటి వ్య‌క్తి రావ‌డం ఏంట‌ని విద్యార్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌ ఆధ్వ‌ర్యంలో స‌మావేశం నిర్వ‌హ‌ణ‌కు అనుమతించమని అన్నారు. పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు జ‌రుగుతుండ‌గా అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ గంద‌ర‌గోళం నెల‌కొంది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దుతున్నారు.

  • Loading...

More Telugu News