Nagarjuna: నాగ్ .. వర్మ తాజా చిత్రంలో గెస్టుగా అమితాబ్?

  • వర్మ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నాగ్ 
  • గెస్టు రోల్ కోసం అమితాబ్ తో సంప్రదింపులు 
  • ఈ నెల 20వ తేదీన సెట్స్ పైకి 
  • ఏప్రిల్ 20వ తేదీన విడుదల        

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ ఒక యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలనేది ఆలోచన. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 'శివ' సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించిన వర్మ, ఈ సినిమా అంతకిమించి ఉంటుందని చెబుతుండటం విశేషం.

ఇక ఈ సినిమాలో అమితాబ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఓ గెస్టు రోల్ వుందట. నిడివి పరంగా చిన్నదే అయినా, కథలో ఈ పాత్ర కీలకంగా నిలుస్తుందని చెబుతున్నారు. దాంతో ఈ పాత్ర కోసం అమితాబ్ ను వర్మ సంప్రదిస్తున్నాడని అంటున్నారు. గతంలో అమితాబ్ - నాగ్ హిందీ 'ఖుదాగవా'లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా 'టబూ' నటిస్తుందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని వర్మ తేల్చేశాడు కూడా. మరి అమితాబ్ గెస్టుగా చేస్తాడనే ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.                

  • Loading...

More Telugu News