Mahesh Babu: 'భరత్ అను నేను' నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 26న మొదలు

  • ఫ్యామిలీతో విదేశాల్లో విహరిస్తోన్న మహేశ్ బాబు 
  • ఈ నెల 20వ తేదీన ఇండియాకి 
  • 26 నుంచి 'పొల్లాచ్చి' షెడ్యూల్ మొదలు 
  • ఏప్రిల్ 27న సినిమా విడుదల    

కొంతకాలంగా 'భరత్ అను నేను' సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతూ వస్తోంది. అసెంబ్లీ సన్నివేశాలను .. సీఎం చాంబర్ కి సంబంధించిన సన్నివేశాలతో పాటు ఒక ఫైట్ ను చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ ను పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

ప్రస్తుతం మహేశ్ బాబు .. ఫ్యామిలీతో విదేశాల్లో విహరిస్తున్నాడు. అక్కడి నుంచి ఆయన ఈ నెల 20వ తేదీన తిరిగిరానున్నాడు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు. తొలిసారిగా కైరా అద్వానీ మహేశ్ తో జోడీ కడుతోంది. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఈ సినిమా రిజల్ట్ చూసిన తరువాత ఆమెను తమ ప్రాజెక్టులలోకి తీసుకుందామనే ఆలోచనలో కొంతమంది దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.   

  • Loading...

More Telugu News